కేసీఆర్‌ను ఒక్కసారి ప్రధానమంత్రిని చేయాలి

కేసీఆర్‌ను ఒక్కసారి ప్రధానమంత్రిని చేయాలి

సీఎం కేసీఆర్‌ను ఒక్కసారి ప్రధానమంత్రిని చేస్తే దేశంలో సమస్యలే ఉండవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 

‘జాతీయపార్టీలుగా చెప్పుకొనే కొన్ని పార్టీలు.. ఎప్పుడో తీసుకొచ్చిన కాలం చెల్లిన పథకాలను ఇప్పటికీ చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. సీఎం కేసీఆర్ గత ఏడేండ్లలో తెలంగాణలో అందరికీ వైద్యం అందించి దేశంలోనే చరిత్ర సృష్టించాడు. అందుకే దేశప్రజలకు ఒక మెసెజ్ ఇవ్వాలి. మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒక్కసారి పీఎంను చేయాలి. మన సీఎం ఒక్కసారి పీఎం అయితే భారతదేశ చరిత్రే మారిపోతుంది’ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.