ముగిసిన మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు

ముగిసిన మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు

నెల్లూరు జిల్లా: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అశేష సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, బంధు మిత్రుల సమక్షంలో మంత్రి గౌతమ్ రెడ్డి తనయుడు కృష్ణార్జున రెడ్డి తన తండ్రి చితికి నిప్పంటించి వీడ్కోలు పలికారు.

తన సహచర మంత్రి గౌతమ్ రెడ్డి అంతిమ వీడ్కోలు కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలలో రాష్ట్ర మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి

శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్​లో సాంకేతికలోపం

ఇటుక బట్టీలో కోటి రూపాయల డైమండ్

సినీ ఇండస్ట్రీలో మరో మరణం