హైదరాబాద్, వెలుగు : రాష్ర్ట ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను సక్సెస్ చేయాలని అధికారులను గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. గైడ్ లైన్స్ పై కసరత్తు చేస్తున్నామని త్వరలోనే స్కీమ్ ను లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. బుధవారం మినిస్టర్ క్వార్టర్స్ లో ప్రభుత్వం కేటాయించిన ఇంట్లోకి మంత్రి గృహ ప్రవేశం చేశారు.
అనంతరం హౌసింగ్ కార్పొరేషన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ సీఎండీ విజయేంద్ర బోయి, సీఈ ఈశ్వరయ్య, ఎస్ ఈ చైతన్యకుమార్ , భాస్కర్ రెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.