ఇవాళ ఓరుగల్లుకు మంత్రి పొంగులేటి

ఇవాళ ఓరుగల్లుకు మంత్రి పొంగులేటి
  •     వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్న  మంత్రి
     

హనుమకొండ, వెలుగు: రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్​, ఇన్​ఫర్మెషన్​, పబ్లిక్​ రిలేషన్స్​ మినిస్టర్​ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఆదివారం వరంగల్ నగరానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు కాకతీయ యూనివర్సిటీకి చేరుకోనున్న ఆయన ముందుగా వర్సిటీలో నిర్మించిన 'కె-హబ్​'ను ప్రారంభించనున్నారు. అనంతరం క్యాంపస్​ లోనే పీవీ నరసింహరావు నాలెడ్జ్ సెంటర్​, ఎస్టీ విమెన్స్​ హాస్టల్​, అడ్మినిస్ట్రేషన్​ బిల్డింగ్​ సెకండ్​ ఫ్లోర్​ లో వీసీ చాంబర్​, హాస్టల్​ డైనింగ్​ హాల్​, సీసీ రోడ్లు, ఆర్ట్స్​ కాలేజీలో ఎంబీఏ బిల్డింగ్ ఫస్ట్​ ఫ్లోర్ ను ప్రారంభించనున్నారు. 

దాంతో పాటు కాకతీయ యూనివర్సిటీలో ఒక లేడీస్​ హాస్టల్​,   బాయ్స్​ హాస్టల్​, మరో దివ్యాంగుల హాస్టల్​ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్​ వాల్, రోడ్డు వైడెనింగ్​ కు ఫౌండేషన్​ స్టోన్ వేస్తారు. ఆ తరువాత ఉర్సు గుట్ట వివిధ జంక్షన్ల బ్యూటిఫికేషన్, బాల సముద్రం చిల్డ్రన్స్​ పార్కు, ఎంజీఎం పీడియాట్రిక్​ వింగ్​లో ప్లే వే ఎక్విప్​మెంట్​, గోవిందరాజుల గుట్ట వద్ద వాటర్​ ట్యాంక్​, స్ట్రోమ్​ వాటర్​ డ్రైనేజీ నిర్మాణంతో పాటు వరంగల్ తూర్పులో ఎస్​డీఎఫ్​ కింద చేపట్టబోయే వివిధ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం  వరంగల్ నుంచి భద్రాచలం వెళ్తారు.