హైదరాబాదీలకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్.. ఇక నుంచి కొత్త కాలనీలకు RTC బస్సులు

హైదరాబాదీలకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్.. ఇక నుంచి కొత్త కాలనీలకు RTC బస్సులు

హైదరాబాదీలకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్‎లో ఇప్పటి వరకు బస్ సర్వీస్ అందుబాటులో లేని కొత్త కాలనీలకు ఆర్టీసీ సేవలు విస్తరిస్తామన్నారు. అలాగే, ఓఆర్ఆర్ లోపల కొత్త రూట్లు ఏర్పాటు చేసి  ప్రయాణికుల సౌకర్యార్ధం బస్సుల సంఖ్య పెంచుతామని తెలిపారు. సోమవారం (జూన్ 30) ముషీరాబాద్ ఆర్టీసీ డిపోను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధునాతన టెక్నాలజీ ద్వారా ఆర్టీసీ అమలు చేస్తున్న డిజిటల్ పేమెంట్స్ అమలు తీరును ఆయన పరిశీలించారు.

ALSO READ | EV News: BMW కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జూలై 3న లాంచ్, రేటెంతంటే..

ఐటీం ద్వారా ఆర్టీసీలో డిజిటల్ పేమెంట్స్, ప్రయాణికుల వివరాలు, హెడ్ ఆఫీస్ కనెక్టివిటీ తదితర సాంకేతికత గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో అధునాతన సంస్కరణలు తీసుకువస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ తీసుకు వస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఆరు వేల బస్సుల్లో డిజిటల్ పేమెంట్ వ్యవస్థ అమల్లోకి తెచ్చామని.. దాని డేటా మొత్తం హెడ్ ఆఫీస్‎లో వెంటవెంటనే అప్డేట్ వస్తుందన్నారు. 

ఢిల్లీ మాదిరిగా తెలంగాణలో కూడా తెలంగాణ లో ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఈవీ వాహనాలు అమ్మకం జరుగుతుందని తెలిపారు. చాలా కాలం తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈవీ, సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు పర్మిషన్లు ఇచ్చామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకం వాహన సారథిలో గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో లేదని.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు.