అర్హులకు డబుల్​ ఇండ్లు ఇస్తం.. మంత్రి పొన్నం ప్రభాకర్

అర్హులకు డబుల్​ ఇండ్లు ఇస్తం.. మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్​సిటీ, వెలుగు: అర్హులందరికీ డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మంత్రి పొన్నం అధ్యక్షతన శనివారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సిటీ తాగునీటి సమస్య పరిష్కారానికి కృష్ణ, గోదావరి నదుల నుంచి 15 టీఎంసీల నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాజీ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, సివిల్ సప్లై, వైద్య ఆరోగ్యం, ఎలక్ట్రిసిటీ, విద్య తదితర అంశాలపై సమీక్షించారు. 

రాజీవ్ యువ వికాస పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి కేటగిరీల వారీగా రుణాలు అందిస్తామని మంత్రి  తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో  41,726 మంది నిరుద్యోగ యువతకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. 1,25, 595 మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. 

ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్​విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, కమిషనర్​ఆర్వీ కర్ణన్, హెచ్ఎండిఏ కమిషనర్ అశోక్ రెడ్డి,హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.