
జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు.. కార్యకర్తల ధర్నా పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ధర్నా ఇక్కడ కాదు చేయాల్సింది.. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇంటి ఎదుట ధర్నా చేయాలన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో రాజకీయాలు వద్దు.. నగర అభివృద్ధి తమ బాధ్యత అన్న మంత్రి పొన్నం... ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ... కేంద్రమంత్రిగా ఉండి.. నగర అభివృద్దికి ఒక్క రూపాయి లేకుండా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దికి అడ్డుపడుతున్నారన్నారు.
జీహెచ్ఎంసీ అభివృద్ధికి.. నగరంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటటుందన్నారు. బీజేపీ ఎన్నికల ముందు ఇటువంటి రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందన్నారు. కిషన్రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుందనన్నారు. ఇకనైనా హైదరాబాద్ అభివృద్దికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో అందరం కలిసి పోరాడుదామన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ కు నిధులు కేటాయించే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేలవాలన్నారు.
►ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. పీసీసీ చీఫ్ వాంగ్మూలం తీసుకోనున్న పోలీసులు