శివాలయాల్లో వసతులు కల్పిస్తా : పొన్నం ప్రభాకర్​

శివాలయాల్లో వసతులు కల్పిస్తా : పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్​నియోజకవర్గంలో విశిష్ట సంస్కృతి, చారిత్రక నేపథ్యమున్న శివాలయాలు ఉన్నాయని, వాటిలో అన్ని వసతులు కల్పిస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.  శుక్రవారం ఆయన మహాశివరాత్రి సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్న శివాలయాల్లో పూజలు చేశారు.  అనంతరం పొట్లపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

నియోజకవర్గంలో 70 శివాలయాలు ఉన్నాయని, వాటికి ఎంతో చరిత్ర ఉందన్నారు. ఆ ఆలయాల్లో అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామన్నారు. శివరాత్రిని పురస్కరించుకొని తాను 15 ఆలయాల్లో పూజలు చేశానన్నారు. రాత్రి వేములవాడలో లింగోద్భవ పూజలో పాల్గొంటానన్నారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ వొడితల సతీశ్​కుమార్, బోయినపల్లి వినోద్​రావు హుస్నాబాద్​లోని మరకత లింగేశ్వరస్వామి, సిద్ధేశ్వరస్వామి, పొట్లపల్లిలోని రాజన్న ఆలయాల్లో పూజలు చేశారు.