బొకేలు, శాలువాలతో సన్మానం వద్దు

బొకేలు, శాలువాలతో సన్మానం వద్దు
 
  • చేనేత టవల్స్​వాడి నేతన్నలను ఎంకరేజ్​చేయండి

  • మంత్రి పొన్నం ప్రభాకర్ రిక్వెస్ట్​


హైదరాబాద్: చేనేత రంగాన్ని కాపాడాలని, కాటన్ ని ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్​కోరారు. చేనేత వస్త్రాలను ఉపయోగించి నేతన్నలను ఎంకరేజ్​చేయాలని రిక్వెస్ట్​చేశారు. ‘మీరు ఎప్పుడైనా గెస్టులకు, పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే చేనేత టవల్స్, బుక్స్, పెన్నులు ఇచ్చి సన్మానించండి. బొకేలు, శాలువాలు మన వద్ద రెడీకావు. వాటి వల్ల  ఉపయోగం లేదు. కాటన్​వస్త్రాలను వాడితే నేతన్నలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది’ అని మంత్రి సూచించారు.