గల్లీలో లడాయి.. ఢిల్లీలో దోస్తానీ: మంత్రి పొన్నం ప్రభాకర్

గల్లీలో లడాయి.. ఢిల్లీలో దోస్తానీ: మంత్రి పొన్నం ప్రభాకర్
  • గల్లీలో లడాయి.. ఢిల్లీలో దోస్తానీ
  • బీజేపీతో పీడించబడని ఏకైక పార్టీ బీఆర్ఎస్
  •  కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేట్ చేసిందే కేసీఆర్
  •  అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్


హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, గల్లీలో కొట్లాడుతూ.. ఢిల్లీలో కలిసి పనిచేస్తాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లలన్నింటికీ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. దేశంలో ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలకు ప్రమాదమని, వారి మీద, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయని అన్నారు. బీజేపీతో పీడించబడని ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు.  కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గా నామినేట్ చేసిందే కేసీఆర్ అని అన్నారు.  భవిష్యత్తులో రెండు పార్టీల మధ్య దోస్తానా ఉండని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు.  

రాష్ట్రానికి నిధులు తెండి

బీజేపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి నిధులు తేవాలని, తాము సహకరిస్తామని పొన్నం అన్నారు. గత ప్రభుత్వం కేంద్రం సహకారం వద్దనుకున్నదని, తాము కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ విషయంలో మహేశ్వర్ రెడ్డి చొరవ చూపాలని అన్నారు.