మంత్రి వెళ్ళేదారిలో యాక్సిడెంట్.. సాయం చేసిన పువ్వాడ

మంత్రి వెళ్ళేదారిలో యాక్సిడెంట్.. సాయం చేసిన పువ్వాడ

మ్మం: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంచి మనసు చాటుకున్నారు. బుధవారం ఉదయం ఖమ్మంలో పర్యటించిన ఆయన ..తిరిగి హైదరాబాద్ వస్తుండగా మార్గ మధ్యలో లారీ-బైక్ ప్రమాద ఘటన జరిగింది. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న మంత్రి.. గాయపడ్డవారిని ట్రీట్ మెంట్ కోసం తన పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో హస్పిటల్ కి తరలించారు. వరంగల్ క్రాస్ రోడ్డు దగ్గర లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

అంబులెన్స్ వచ్చేవరకు ఆలస్యం అవుతుందని గ్రహించిన పువ్వాడ.. తన ఎస్కార్ట్ వెహికిల్ లోనే క్షతగాత్రులను ఆయన సొంత హస్పిటల్ అయిన ఖమ్మం మమత హస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ అదుపుతప్పడమే ప్రమాదానికి కారణం అంటున్నారు స్థానికులు. లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ ను విచారిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.