విద్యా శాఖ అధికారులపై మంత్రి సబితారెడ్డి ఆగ్రహం

విద్యా శాఖ అధికారులపై మంత్రి సబితారెడ్డి ఆగ్రహం

బదిలీలు, ప్రమోషన్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భాష పండితులను విద్యా శాఖ అధికారులు సస్పెండ్ చేశారని పండిత JAC మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలియజేశారు. వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన ఆమె.. ప్రభుత్వానికి తెలియకుండా మీరెలా సస్పెండ్ చేస్తారు, వివరాలు ఎలా సేకరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ను పరిష్కరించాల్సింది పోయి జఠిలం చేస్తున్నారని అధికారులపై సీరియస్ అయ్యారు.

సీఎం కేసీఆర్ సమస్యను పరిష్కరించమని మమ్మల్ని ఆదేశించారని.. మాకు తెలుపకుండా ఇంకా ఎవరిని సస్పెండ్ చేయడం, వివరాలు సేకరించవద్దని అధికారులకు మంత్రి అదేశాలు జారీ చేశారు.  సస్పెండ్ చేసిన ముగ్గురివి సస్పెండ్ ఆర్డర్ వెనక్కి తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బదిలీలు... ప్రమోషన్లలో తమకు అవకాశం కల్పించేవరకు శాంతియుతంగా పోరాటం చేస్తామని భాష పండితులు స్పష్టం చేశారు.