అన్ని రంగాల్లో మానుకోటను  ముందుంచుతాం : సత్యవతి రాథోడ్

అన్ని రంగాల్లో మానుకోటను  ముందుంచుతాం : సత్యవతి రాథోడ్

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం  ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ..   మానుకోట జిల్లాలో అన్ని రంగాల్లో  ముందు నిలుపుతున్నట్లు తెలిపారు.  

ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్  సీఎం కేసీఆర్ సహకారంతో మంజూరు కావడం సంతోషకమన్నారు.  కార్యక్రమంలో  ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్​నాయక్​, జడ్పీ చైర్​సర్సన్​ బిందు, కలెక్టర్​ శశాంక, ఎస్పీ  శరత్ చంద్ర పవార్​, అడిషన్​ కలెక్టర్​దేవిడ్​ తదితరులు ఉన్నారు.