ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాలు: మంత్రి సత్యవతి

ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాలు: మంత్రి సత్యవతి

రాష్ట్రంలో పోడు భూములకు ఫిబ్రవరిలో పట్టాలిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే వంద శాతం సర్వేను గ్రామ సభల ద్వారా పూర్తి చేశామన్నారు. పోడు భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఫారెస్ట్ రైట్స్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీల ద్వారా పరిశీలించి లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పోడు భూములకు సంబంధించి పత్రాలు జారీ చేసే అంశంపై అన్ని జిల్లా కలెక్టర్లతో మంత్రి సత్యవతి రాథోడ్ వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. 

అర్హులైన ప్రతీ ఒక్కరికీ పోడు భూములకు పట్టాలిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అడవుల సంరక్షణకు ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత నిస్తుందని స్పష్టం చేశారు. పోడు భూములకు ఏ జిల్లాలో అధికంగా దరఖాస్తులు అందాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో స్థానిక ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యులను చేయాలని కలెక్టర్లకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో అటవీ శాఖ, రెవెన్యూ సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు.