భద్రాచలం ట్రైబల్​ మ్యూజియాన్ని సందర్శించిన సీతక్క

 భద్రాచలం ట్రైబల్​ మ్యూజియాన్ని సందర్శించిన సీతక్క

భద్రాచలం, వెలుగు : రాష్ట్ర పంచాయతీరాజ్​, స్త్రీ శిశు సంక్షేమశాఖ  మంత్రి ధనసరి సీతక్క బుధవారం రాత్రి భద్రాచలం ఐటీడీఏ  ప్రాంగణంలోని ట్రైబల్​మ్యూజియాన్ని సందర్శించారు. ట్రైబల్​ హౌస్, ట్రైబల్​ ఉత్పత్తులు గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఆడుకునే స్విమ్మింగ్​ పూల్​లో దిగి పిల్లలతో ముచ్చటించారు. మ్యూజియం ద్వారా ఆదివాసీల సంస్కృతి,సంప్రదాయాలను బాహ్యప్రపంచానికి తెలియజేయాలని సూచించారు.