
భద్రాచలం, వెలుగు : రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క బుధవారం రాత్రి భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్మ్యూజియాన్ని సందర్శించారు. ట్రైబల్ హౌస్, ట్రైబల్ ఉత్పత్తులు గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఆడుకునే స్విమ్మింగ్ పూల్లో దిగి పిల్లలతో ముచ్చటించారు. మ్యూజియం ద్వారా ఆదివాసీల సంస్కృతి,సంప్రదాయాలను బాహ్యప్రపంచానికి తెలియజేయాలని సూచించారు.