
ఇబ్రహీంపట్నం, వెలుగు: అన్ని సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని బేగరికంచలో యంగ్ఇండియా స్కిల్యూనివర్సిటీ నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.
అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నైపుణ్యానికి రాజధానిగా ఎదగాలని ఆలోచనతో ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. మాటలకే పరిమితం కాకుండా ఆ దిశగా చట్టం తీసుకువచ్చి, తాత్కాలికంగా ఇంజినీరింగ్స్టాఫ్కాలేజీలో కొనసాగిస్తున్నట్లు చెప్పారు.