మ్యాచ్ టికెట్ల గోల్మాల్పై మంత్రి సీరియస్

మ్యాచ్ టికెట్ల గోల్మాల్పై మంత్రి సీరియస్

హైదరాబాద్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ చేశారన్న వార్తలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. బ్లాక్లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని టికెట్లు ఆన్లైన్లో అమ్మాల్సిందేనన్న ఆయన.. స్టేడియం కెపాసిటీ ఎంత..? టికెట్లు ఎలా అమ్మారన్న విషయంపై ఆరా తీస్తామన్నారు. తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చితే సీఎం కేసీఆర్ సహించరని.. ఆ విధంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకోమని స్పష్టం చేశారు 

ప్రభుత్వం భూమి ఇస్తేనే హెచ్సీఏ వాళ్ళు స్టేడియం కట్టుకున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. తెలంగాణలో అక్రమాలు సాగవని.. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. హెచ్సీఏపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినా.. మన పరువే పోతుందని తెలిపారు. హెచ్ సీఏ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. టికెట్ల అంశంపై క్రీడా సంస్థ, పోలీసుల నిఘా ఉందని చెప్పారు.