ఆర్టీసీ కార్మికులపై మంత్రి తలసాని అసహనం

ఆర్టీసీ కార్మికులపై మంత్రి తలసాని అసహనం

సమస్య పరిష్కరించాలంటూ తలసానిని కలిసిన ఆర్టీసీ కార్మికులపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి పర్యటనలో ఉన్న తలసానిని ఆర్టీసీ కార్మికులు కలిశారు. తమ సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేయాలని మంత్రిని కోరారు. దీంతో కార్మికులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తలసాని… అక్కడి నుంచి వెళ్లిపోయారు.