
మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి గురువారం ఫిష్ఫుడ్ఫెస్టివల్ ప్రారంభించారు. తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ ని చూడటానికి చాలా మంది తరలివచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్కి తరలి రావాలని కోరారు. 600 మంది మహిళలకు ఫిష్కుకింగ్లో ట్రైనింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 800 స్టాల్స్ ప్రారంభమైనట్లు తెలిపారు. 10 వ తేదీ వరకు ఫెస్టివల్ నడపనున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని మరిచాయ్..
మత్స్యకారుల సంక్షేమానికి గత ప్రభుత్వాలు బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు ఆ బడ్జెట్ను రూ.100 కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. సీఎం కేసీఆర్ వారి సంక్షేమాన్ని కాంక్షించి ఎన్నో పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని పట్టణాల్లో ఫిష్ స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. డిగ్నిటీ భవన్ కి నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.