మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి తలసాని శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ స్టేడియంలో మంత్రి గురువారం ఫిష్​ఫుడ్​ఫెస్టివల్​ ప్రారంభించారు. తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ ని చూడటానికి చాలా మంది తరలివచ్చారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ..  ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్​కి తరలి రావాలని కోరారు.  600 మంది మహిళలకు ఫిష్​కుకింగ్​లో ట్రైనింగ్​ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 800 స్టాల్స్​ ప్రారంభమైనట్లు తెలిపారు. 10 వ తేదీ వరకు ఫెస్టివల్​ నడపనున్నట్లు చెప్పారు.  

గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని మరిచాయ్​..

మత్స్యకారుల సంక్షేమానికి గత ప్రభుత్వాలు  బడ్జెట్​లో రూ.10 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు ఆ బడ్జెట్​ను రూ.100 కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు.  కాంగ్రెస్​ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు.  సీఎం కేసీఆర్​ వారి సంక్షేమాన్ని కాంక్షించి ఎన్నో పథకాలు తీసుకొచ్చారని చెప్పారు.  రాబోయే రోజుల్లో అన్ని పట్టణాల్లో ఫిష్​ స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.  డిగ్నిటీ భవన్ కి నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.