సనత్ నగర్ నుంచి బస్సు సర్వీసులను పునరుద్దరించాలి: తలసాని

సనత్ నగర్ నుంచి  బస్సు సర్వీసులను పునరుద్దరించాలి: తలసాని

సనత్ నగర్ నుంచి అన్ని బస్సు సర్వీస్ లను వెంటనే పునరుద్దరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఇవాళ ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి సనత్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో పర్యటించారు. సిటీలోని వివిధ ప్రాంతాలకు సనత్ నగర్ నుంచి చాలా బస్సు సర్వీసులను రద్దు చేయడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే రద్దు చేసిన సర్వీసులను పునరుద్దరించాలని ఆదేశించారు. సనత్ నగర్ మెయిన్ రోడ్ ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని చెప్పారు.