- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దుండిగల్, వెలుగు : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మల్కాజిగిరి లోక్సభ స్థానం గెలుపు తొలి మెట్టు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్అభ్యర్థి సునీతామహేందర్ రెడ్దిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం మినీ ఇండియా అన్నారు. మరోసారి కాంగ్రెస్జెండాఎగరవేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దోపిడీ లేని ప్రభుత్వం నడుస్తోందని
ఆరు గ్యారెంటీల అమలును ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిచేసుకుని, సిట్టింగ్సీటును సీఎం రేవంత్రెడ్డికి తిరిగి ఇవ్వాలని కోరారు. కొంత మంది కాంగ్రెస్ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సునీతామహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. సమావేశంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ నాయకులు కొలను హన్మంత్ రెడ్డి, నర్సారెడ్డి భూపతి రెడ్డి, కొలను శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.