ఇప్పుడు సీడీఎస్‌పైనా దేశద్రోహి ముద్ర వేస్తరా : మంత్రి ఉత్తమ్

ఇప్పుడు సీడీఎస్‌పైనా దేశద్రోహి ముద్ర వేస్తరా : మంత్రి ఉత్తమ్
  • ఇప్పుడు సీడీఎస్‌పైనా దేశద్రోహి ముద్ర వేస్తరా : మంత్రి ఉత్తమ్ 
  • ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఏం జవాబు చెప్తరు?
  • ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఏం జవాబు చెప్తరు?
  • మనం రాఫెల్ జెట్ కోల్పోయామని రాహుల్ మొదట్నుంచీ చెప్తున్నరు 
  • సీడీఎస్ కామెంట్లు దానికి బలాన్ని చేకూర్చుతున్నయ్ 
  • ఆపరేషన్ సిందూర్ విజయాలను ప్రచారం చేసుకున్న బీజేపీ.. నష్టాలను మాత్రం ఎందుకు దాస్తున్నదని ప్రశ్న 

న్యూఢిల్లీ, వెలుగు:  ఆపరేషన్ సిందూర్‌‌లో మన దేశం ఒక యుద్ధ విమానం కోల్పోయిందన్న సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ అనిల్ చౌహాన్‌పై కూడా దేశద్రోహి ముద్ర వేస్తారా? అని బీజేపీ నేతలను మాజీ ఫైలెట్​, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 

‘‘కాంగ్రెస్ చెబుతున్న దానికి సీడీఎస్ వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చుతున్నాయి. మనం రాఫెల్ ఫైటర్ జెట్ కోల్పోయామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి నుంచీ చెబుతుంటే.. ఆయనకు దేశభక్తి లేదని, దేశద్రోహి అని ప్రధాని మోదీ, అమిత్ షా  తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరిప్పుడు సీడీఎస్‌‌‌‌‌‌‌‌పైనా దేశద్రోహి ముద్ర వేస్తారా? ఆయన వ్యాఖ్యలపై దేశ ప్రజలకు బీజేపీ నేతలు ఏం జవాబు చెబుతారు?” అని నిలదీశారు. 

దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీ అక్బర్ రోడ్‌‌‌‌‌‌‌‌లోని ఏఐసీసీ కార్యాలయంలో ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ‘‘గాంధీ కుటుంబం దేశం కోసం ఇద్దరిని కోల్పోయింది. వాళ్లకంటే గొప్ప దేశ భక్తులు ఎవరూ లేరు. అలాంటి కుటుంబానికి చెందినోళ్లను దేశ ద్రోహులంటూ బీజేపీ నేతలు ముద్ర వేస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు. 

‘‘ఆపరేషన్ సిందూర్ పేరుతో విజయాలను అద్భుతంగా ప్రచారం చేసుకున్న బీజేపీ.. నష్టాలను మాత్రం ప్రజలకు తెలియకుండా ఎందుకు దాస్తున్నది. యుద్ధం జరిగేటప్పుడు ప్రకటించకపోయినా ఫర్వాలేదు.. కానీ యుద్ధం ముగిసిన తర్వాతైనా చెప్పాలి కదా! అదే విషయాన్ని దేశ ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రశ్నిస్తే తప్పేంటి?” అని అన్నారు. 

దీనిపై రాజకీయం చెయ్యం.. 

పాక్‌‌‌‌‌‌‌‌పై మన ఆర్మీ అద్భుత విజయం సాధించిందని ఉత్తమ్ అన్నారు. ఇందుకు సైనికులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ‘‘యుద్ధ విమానాల విషయంలో మేం రాజకీయాలు చేయదల్చుకోలేదు. కానీ సీడీఎస్ చెప్పిన అంశాలపైనే మేం ప్రశ్నిస్తున్నాం” అని చెప్పారు. ‘‘మన దగ్గర సరిపోను యుద్ధ విమానాలు లేవని ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ చీఫ్‌‌‌‌‌‌‌‌ స్వయంగా చెప్పారు. టాలెంట్ ఉన్నోళ్లు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌లోకి రావడం లేదని ఆయన తెలిపారు. టాలెంట్ ఉన్న యువత ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌లో చేరేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్ డిఫెన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న నేను.. దేశ రక్షణపై కేంద్రానికి అనేక సార్లు సూచనలు చేశాను” అని పేర్కొన్నారు.