జూబ్లీహిల్స్ గెలుపు సమష్టి విజయమిది..మంత్రి వివేక్ వెంకటస్వామి

జూబ్లీహిల్స్ గెలుపు సమష్టి విజయమిది..మంత్రి వివేక్ వెంకటస్వామి

జూబ్లీహిల్స్, వెలుగు: సమష్టి కృష్టితోనే జూబ్లీహిల్స్ విజయం సాధ్యమైందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికకు ఇన్​చార్జి మంత్రిగా పనిచేసిన ఆయనను శుక్రవారం పలువురు కలిసి అభినందించారు. షేక్ పేటలో మంత్రి వివేక్​ను.. ఎంపీ అనిల్​కుమార్ యాదవ్​, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నేతలు నీలం మధు, ఫయీమ్ ఖురేషి తదితరులు  కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా ఏండ్ల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారన్నారు. ఇది పార్టీకి నూతన ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. షేక్ పేట డివిజన్  బూత్ లెవెల్​లో కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేస్తూ పనిచేసిన నేతలను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.