
మంత్రి వివేక్ వెంకటస్వామి మానవత్వం చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అఖిలేష్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి చెయ్యి విరిగిపోగా అత్యవసర వైద్యం కోసం ఆర్థికసాయం అందించి ఆదుకున్నారు మంత్రి వివేక్.అత్యవసర వైద్యం కోసం రూ. లక్షా 80 వేలు LOC అందించి మానవత్వం చాటుకున్నారు మంత్రి వివేక్. LOC ద్వారా చికిత్స అందుకొన్న అఖిలేష్ ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అఖిలేష్ ప్రాణాన్ని కాపాడిన మంత్రి వివేక్ కు ధన్యవాదాలు తెలిపారు కుటుంబసభ్యులు.
ఇదిలా ఉండగా.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి శనివారం ( జూన్ 14 ) మంచిర్యాల జిల్లాకు వచ్చిన మంత్రి వివేక్ కు కాంగ్రెస్ లీడర్లు, అభిమానులు, మాల సంఘం నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలోని ఇందారం, జైపూర్, భీమారం, చెన్నూరు, రామకృష్ణాపూర్, మందమర్రిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. ప్రస్తుతం ఇసుక రాయల్టీ ద్వారా రాష్ట్రానికి రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని దానిని పెంచాలన్న ఉద్దేశంతోనే సీఎం రేవంత్రెడ్డి తనకు మైనింగ్ శాఖను అప్పగించారని చెప్పారు
ఈ క్రమంలో మంత్రి వివేక్ మాట్లాడుతూ ఇసుక దందాను అడ్డుకోవడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేలా పనిచేస్తానని మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెప్పారు. నిజాయితీగా పనిచేసి అవినీతి, అక్రమాలను అడ్డుకుంటానన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక, బియ్యం, భూదందాలను అడ్డుకున్నానని, ఇందుకు ప్రజలు సైతం సహకరించారన్నారు