
సదాశివనగర్, వెలుగు: మైనింగ్, కార్మిక శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామిని ఉద్యమకారుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాలల సంఘం రాష్ట్ర, కాంగ్రెస్ జిల్లా నాయకుడు బంటు భూమేశ్ గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. మంత్రిని శాలువాతో సన్మానిం చారు. మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు. మాలల అభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు.
మంత్రులను కలిసిన డీసీసీ ప్రెసిడెంట్..
నిజామాబాద్, వెలుగు: మైనింగ్, కార్మిక శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పశుసంవర్థక, క్రీడలు, యువజన శాఖల మంత్రి వాకిటి శ్రీహరి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్లను డీసీసీ ప్రెసిడెంట్, స్టేట్ కోఆపరేటివ్డెవలప్మెంట్కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.