హైదరాబాద్: పదేళ్లలో బీఆర్ఎస్చేసిన అభివృద్ధి ఒక్కటి కనిపించలేదు.. కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ అభివృద్ది జరుగుతుంది.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
శనివారం ( నవంబర్8) షేక్ పేట్ డివిజన్ లోని వివేకా నంద నగర్ కాలనీ వాసులను కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రాంతాల అభివృద్దిపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది.. మీ సమస్యలు పరిష్కరిస్తాం.. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై గొంతు వినిపించాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని విజ్ణప్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకి దాదాపు 200 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్యాదవ్ ను గెలిపించుకుంటే మరింత అభివృద్ది జరుగుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
వివేకానందనగర్ కాలనీలో సమస్యలపై స్థానికులు వినతి పత్రాలు ఇవ్వగా వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఈ కాలనీ వాసులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. నవంబర్ 11 న జరిగే ఎన్నికల పోలింగ్ లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు.
