జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రికి ఘన స్వాగతం.. మంచిర్యాలజిల్లాలో కాంగ్రెస్ లో చేరిన BRS సర్పంచ్ లు

జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రికి ఘన స్వాగతం.. మంచిర్యాలజిల్లాలో కాంగ్రెస్ లో చేరిన BRS సర్పంచ్ లు

కోల్​బెల్ట్/లక్సెట్టిపేట, వెలుగు: జపాన్ పర్యటన ముగించుకొని మంచిర్యాల జిల్లాకు వచ్చిన మంత్రి వివేక్ ​వెంకటస్వామికి కాంగ్రెస్​ నేత మంతెన జగన్​మోహన్​రావు ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల లీడర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లీడర్లతో కలిసి లక్సెటిపేట మండలం తిమ్మాపూర్​కు చెందిన మాజీ జడ్పీటీసీ ముత్తె సత్తయ్య, చందారం గ్రామంలో మాజీ ఎంపీపీ అన్నం మంగా-చిన్నయ్య దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు.

 క్యాతనపల్లిలో మంచిర్యాల ఆర్డీవో గూడూరి శ్రీనివాస్​ రావు–-సుధారాణి దంపతుల కొడుకు అరుణ్​కుమార్–శ్రీజ, మంచిర్యాలలో కాంగ్రెస్​ యూత్​లీడర్ అరాకాల రమేశ్–నాగశ్వేత వివాహ వేడుకలకు మంత్రి వివేక్​హాజరయ్యారు. ఇటీవల వివాహమైన మందమర్రి మండల కాంగ్రెస్​ లీడర్లు​ పుల్లూరి లక్ష్మణ్–కళావతి దంపతుల కూతురు కీర్తన–-మనోజ్ ​కుమార్, మేడ రాజు–కవిత దంపతుల కొడుకు సాయికిరణ్–యోకె బెడుమేరి, లక్సెట్టిపేట మండల లీడర్లు మూల కిషన్​ గౌడ్ కూతురు భవిత–మహేశ్​ గౌడ్, నరేందుల సతీశ్​ కొడుకు అన్వేశ్–ప్రజ్క్షశ్రీని ఆశీర్వాదించారు. 

రామకృష్ణాపూర్​కు చెందిన మాజీ ఎంపీపీ మహంకాళీ శ్రీనివాస్​ను మంత్రి పరామర్శించారు. కోటపల్లి మండలం రాంపూర్​ గ్రామానికి చెందిన బీఆర్​ఎస్ సర్పంచి మానుమండ్ల రమేశ్, వార్డు సభ్యులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.