చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు . ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్... మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో 100 శాతం రాయితీపై ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తుందన్నారు.
ప్రోటీన్ కావాలంటే చేపలు తినాలని..అందులో న్యూట్రిషన్ ఉంటుందన్నారు మంత్రి వివేక్. గొల్లవాగు ప్రాజెక్టును మా నాన్న కాకా వెంకటస్వామి కట్టించారని చెప్పారు. జూబ్లీహిల్స్ లో మాత్యకారులు కాంగ్రెక్ పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పారు. మీ అందరికోసం భీమారంలో సొసైటీ భవనాన్ని నిర్మించామని తెలిపారు వివేక్.
ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు మత్స్యకారులు. ఫిష్ మార్కెట్ కావాలని.. విద్యుత్ లైన్స్ కావాలని అడిగారు. చెరువు పూడిక తీత, చెరువులో చెట్లు తొలగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ త్వరలోనే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
