ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ మహిళా మంత్రులు

ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ మహిళా మంత్రులు

తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో నాలుగున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో చాలా అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై చర్చించారని సమాచారం అందుతోంది. మార్చి 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించడం కోసం ధర్నా’ కార్యక్రమానికి మద్దతు తెలపడం కోసం మంత్రులు ఢిల్లీ బాట పట్టారు. ఇవాళ రాత్రికి కొందరు మంత్రులు ఢిల్లీకి వెళ్తున్నారు.

మరికొందరు మంత్రులు (మార్చి 10న) ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. కవిత చేపట్టిన దీక్షకు మహిళా మంత్రులు సంఘీభావం ప్రకటించారు. కవిత దీక్షలో పాల్గొనేందుకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ రాత్రికి ఢిల్లీకి వెళ్తున్నారు.