చిన్నారులు, మహిళలపై కామాంధుల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. చుట్టూ ఎవరూ లేని సమయం చూసి వారికి మాయమాటలు చెప్పి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. కీచకుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మిరాట్ జిల్లాలో జరిగిన ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు ఎన్నిచట్టాలు చేసినా మహిళలు, మైనర్ బాలికలపై ఆగడాలు ఆగడం లేదు. కామాంధులు చిన్నా, పెద్దా తేడా లేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. కామాంధులు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు.
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మీరట్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. అంతేకాదు ఈ నీచులు బాలిక వీడియోను వైరల్ చేశారు. ఈ హృదయ విదారక వీడియోలో బాధితురాలి ఏడుపు కూడా వినపడింది. అన్నా నా బట్టలు చించవద్దు అని ఏడుస్తున్నా నిందితులు పట్టించుకోకుండా పశువుల కంటే హీనంగా ప్రవర్తించారు. ఆ అమ్మాయి సహాయం చేయండి అంటూ రోదించినా కనికరించలేదు. ఈ ఘటన కిథోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత మైనర్ బాలికను రెండేళ్లుగా షకీర్ అనే నిందితుడు లైంగికంగా వేధించాడని బాధితురాలు తల్లి పోలీసులకు తెలిపింది. మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది.
మూడు నెలల క్రితం షకీల్ బాధిత మైనర్ బాలికకు డ్రగ్స్ ఇచ్చి దగ్గరలోని అడవికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని షకీల్ తన స్నేహితులు మరియు అతని స్నేహితులు ఆలం, పప్పు, షోయబ్, హైదర్లకు సమాచారం ఇవ్వడంతో .. ఆయన చెప్పిన స్థలంలో దాణా కోసం పశువులు ఎదురుచూస్తున్నట్లుగా వారు ఎదురు చూస్తున్నారు. వీరందరూ బాధితురాలిపై దాడి చేసి కుక్కలకంటే హీనంగా ప్రవర్తించారు. ఆమెను బలాత్కారం చేస్తే వీడియో చిత్రీకరించారు. ఆ తరువాత నిందితులు బాధితురాలిని తమతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని.. లేకపోతే వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో బాలిక వారి డిమాండ్లను నిరాకరించడంతో నిందితుడు ఆ వీడియోను ఆమె సోదరుడికి పంపించాడు. దీంతో బంధువులు పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షకీర్, ఆలం, పప్పులను అరెస్ట్ చేశారు.ఈ కేసులో ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలి స్టేట్మెంట్ను నమోదు చేశామని, ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.