సమ్మె ఎఫెక్ట్: ఆదివారాలు కూడా సెలవుల్లేవ్​

సమ్మె ఎఫెక్ట్: ఆదివారాలు కూడా సెలవుల్లేవ్​
  • తెలంగాణ మైనారిటీ గురుకుల సొసైటీ సర్క్యులర్​
  • సెలవులు పెంచడం వల్లేనంటున్న అధికారులు
  • మండిపడుతున్న టీచర్లు, లెక్చరర్లు

హైదరాబాద్​, వెలుగు:

నవంబర్​లో ఆదివారం సెలవులు రద్దు చేస్తూ మైనారిటీ గురుకుల ఎడ్యుకేషనల్​ సొసైటీ నిర్ణయం తీసుకుంది. ఆదివారాలూ స్కూళ్లు, కాలేజీలు నడుస్తాయని ఆ సంస్థ సెక్రటరీ ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్డర్స్​ను అధికారికంగా ఈ నెల 18నే ఇచ్చినా మంగళవారం బయటకొచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 204  మైనారిటీ గురుకుల స్కూళ్లున్నాయి. వాటిలో1,30,560 మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు. 7069 మంది సిబ్బంది పని చేస్తున్నారు.

దసరా సెలవుల తర్వాత ఈనెల14 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం సెలవులను 20 వరకు పొడిగించింది. సమ్మె వల్ల పొడిగించిన సెలవులను కవర్​ చేయడంలో భాగంగా ఇప్పటికే సర్కారు రెండో శనివారం సెలవులను రద్దు చేసింది. ఇప్పుడు సిలబస్​ పూర్తి చేయాలన్న కారణంతో నవంబర్​లో ఆదివారం సెలవులను మైనారిటీ గురుకుల సొసైటీ రద్దు చేసింది. అయితే జనరల్​స్కూళ్లతో పోలిస్తే గురుకులాల్లో పనిభారం ఎక్కువగా ఉందని, వారానికో రోజు నైట్​ డ్యూటీ చేయాల్సి రావడం, బోధనేతర పనులతో అవస్థలు పడుతున్నామని టీచర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఆదివారం సెలవులను రద్దు చేయడంపై వాళ్లు మండిపడుతున్నారు. ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. పని ఒత్తిడితో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్​ (టీఎస్​డబ్ల్యూఆర్​ఎస్​) టీచర్​ (పీజీటీ) ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read more News

Minority Gurukul Educational Society's decision to cancel Sunday holidays in November