మిరాలంమండి బోనాల్లో స్వర్ణలత రంగం భవిష్యవాణి

మిరాలంమండి బోనాల్లో స్వర్ణలత రంగం భవిష్యవాణి

హైదరాబాద్​ నగరంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మిరాలం మండి వద్ద రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తనకు జరగిన పుజలపై అమ్మవారు సంతృప్తి చెందారు.  అందరిని రక్షిస్తానని అమ్మవారు అభయమిచ్చారు. పాడిపంటలు పుష్కలంగా పండుతున్నాయని.. పంటలే కాదు చెట్లు కూడా పెంచాలని అమ్మవారి సూచించారు. ఈ ఏడాది కూడా వర్షాలకు కొదవలేదని.. కోరినన్ని వర్షాలు ఉన్నాయని అమ్మవారు చెప్పారు.