Pankaj Tripathi: మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట విషాదం

Pankaj Tripathi: మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట విషాదం

మీర్జాపూర్ సిరీస్ నటుడు పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi) ఇంట విషాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన బావ రాకేష్ తివారీ(Rakesh thiwari) కన్నుమూశారు. ఈ ప్రమాదంలో పంకజ్ త్రిపాఠి సోదరి సబితా తివారీ(Sabitha thiwari) తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

రాకేష్ తివారీ, సబితా తివారీ దంపతులు బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్న సమయంలో.. ఢిల్లీ-కోల్‌కతా జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే రాకేశ్ తివారీ మృతి చెందినట్లు నిర్దారించారు డాక్టర్లు. ఇక పంకజ్ త్రిపాఠి సోదరి సబితా తివారీ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు.