కాపలాదారుడే దొంగ.. షోరూం నుంచి బైక్ ఎత్తుకెళ్లిన వాచ్మన్

కాపలాదారుడే దొంగ.. షోరూం నుంచి బైక్ ఎత్తుకెళ్లిన వాచ్మన్

మియాపూర్, వెలుగు: కంచె చేను మేసిన చందంగా దొంగలు రాకుండా చూడాల్సిన వ్యక్తే దొంగతనం చేశాడు. బైక్ షోరూమ్ లో నైట్ వాచ్​మన్ గా పనిచేస్తూ బైక్  దొంగలించిగా వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మియాపూర్ శ్రీవాణినగర్ లో నివాసముండే నక్క కిశోర్ కుమార్(31) మదీనగూడలో హెడ్వే మోటార్ షోరూమ్ లో నైట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. 

ఈ నెల 2న  ఉదయం 5:40 గంటల సమయంలో షోరూంలో పవర్ మెయిన్ స్విచ్ బంద్ చేసి సర్వీస్ సెంటర్ లో ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ను దొంగలించాడు. షోరూమ్ మేనేజర్ కార్తీక్ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాల ఆధారంగా వాచ్​మన్​ ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆయనను అరెస్ట్ చేసి, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.