నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే

నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే

జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ పట్టణంలోని కైలాసగిరి శివాలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న అష్టోత్తర సహస్ర నాగదేవత మందిరం, 1008 నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో భక్తి భావన పెంపొంది సోదర భావం నెలకొంటుంద న్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్  చైర్మన్ శివకుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుభాష్, పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.