సిరికొండ మండలంలో విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి

సిరికొండ మండలంలో విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి

సిరికొండ, వెలుగు: మండలంలోని పెద్దవాల్గోట్ గ్రామంలోని ఆంజనేయ స్వామి  విగ్రహ ప్రతిష్టాపనలో  రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నారు.  ప్రజా పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు.  

కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, మండలాధ్యక్షుడు బాకారం రవి, గాదరి నర్సారెడ్డి, రాములు, లియాకత్, దేగం సాయన్న తదితరులు ఉన్నారు.