కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది

కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది

సీఎం కేసీఆర్  కు దళితుల ఓట్ల మీదే తప్ప.. దళితుల మీద ప్రేమ లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధును తీసుకొచ్చారని.. హుజూరాబాద్ ఉపఎన్నిక ఉండకపోతే దళితబంధు ఉండేది కాదన్నారు. తన రాజీనామాతోనే కేసీఆర్ దిగొచ్చారని ఆయన అన్నారు. దళితులందరికీ దళితబంధు పథకం కింద రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దళితబంధు డబ్బులు ప్రగతి భవన్ నుంచి ఇవ్వడం లేదని... ఇచ్చేది ప్రజల డబ్బునే అని అన్నారు ఈటల.

ఊరూరా బెల్ట్ షాపులను పెట్టి ఎన్నో కుటుంబాలను రోడ్డుమీద పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. తాను అమాయకుడిని కాదని, ఉద్యమ బిడ్డనని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికలు అయిన మరుసటి రోజు నుంచి ఇక్కడ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా కనిపించడం లేదన్నారు. కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పారు.

 

మరిన్ని వార్తల కోసం..

సీఎం అభ్యర్థిగా చన్నీ ఓకే అన్న సిద్ధూ