ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి : మహిపాల్ రెడ్డి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి : మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం/పటాన్​చెరు,వెలుగు: బీఆర్‌‌ఎస్​ ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ముత్తంగి,  ఐనోలు,  ఇస్నాపూర్ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామం అద్భుత ప్రగతి సాధిస్తుందన్నారు. 10 సంవత్సరాల కాలంలో 65 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించారని పేర్కొన్నారు.

ప్రజలు అభివృద్ధిని గుర్తించి కేసిఆర్​ను మూడోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం122 తెలంగాణ క్రీడా ప్రాంగణానాలకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి జీఎంఆర్​ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, సర్పంచులు ఉపేందర్, పద్మ వెంకటేశ్​, బీఆర్​ఎస్​ మండల అధ్యక్షులు పాండు, నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పంచాయతీరాజ్ డీ ఈ సురేశ్, ఎంపీడీవో బన్సీలాల్ పాల్గొన్నారు.