హిమాచల్ హైడల్ ప్రాజెక్టుకు డబ్బులెక్కడివి .. సీఎం రేవంత్​ను​ ప్రశ్నించిన హరీశ్​రావు

హిమాచల్ హైడల్ ప్రాజెక్టుకు డబ్బులెక్కడివి .. సీఎం రేవంత్​ను​ ప్రశ్నించిన హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు: హిమాచల్ ప్రదేశ్​లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్​కోను రంగంలోకి దించుతూ సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరూ నమ్మడం లేదని ప్రతీ వేదికపై చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ హైడల్ పవర్ ప్రాజెక్టుకు రూ.6,200 కోట్లు ఎలా ఖర్చు పెట్టబోతున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. 

హిమాచల్  హైడల్ ప్రాజెక్టు నుంచి మోసర్ బేర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ పారిపోయినా, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ కంపెనీ 3 ఏండ్ల తర్వాత సాధ్యం కాదని వదిలేసినా.. 510 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి టీజీ జెన్ కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు.