నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా : కూనంనేని సాంబశివరావు

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా : కూనంనేని సాంబశివరావు
  • ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

పాల్వంచ రూరల్, వెలుగు :  కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. బుధవారం పాల్వంచ మండలం గంగదేవిగుప్ప, దంతెలబొర, బండ్రగూడెం, నారాయణరావుపేట, సంగం, రేపల్లెవాడ, బొజ్జాతండా, నాగారం, రంగాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంలో చదువుకున్న యువతకు ఉపాధి కల్పన కోసం కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్​ వైస్​ చైర్మన్​ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్​కే షబీర్​పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, కాంగ్రెస్​ రాష్ట్ర నాయకుడు నాగా సీతారాములు, టీడీపీ  రాష్ట్ర నాయకులు కనగాల అనంతరాములు, అడుసుమల్లి సాయిబాబు, వడ్లమూడి పూర్ణ, ఇట్టి వెంకట్రావు, ఎస్​ శ్రీనివాసరావు, బాలినేని నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.