రూ.200 కోట్ల పనులకు ప్రపోజల్స్​: ఎమ్మెల్యే కూనంనేని

రూ.200 కోట్ల పనులకు ప్రపోజల్స్​: ఎమ్మెల్యే కూనంనేని

పాల్వంచ, వెలుగు: తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కొత్తగూడెంను రూ.1200 కోట్లతో అభివృద్ధి చేశానని, మరో రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు ప్రపోజల్స్​ పంపానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో వైద్యానికి రూ.224 కోట్లు, విద్యకు రూ.223 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అత్యధికంగా రహదారులు, భవనాల శాఖ నుంచి రూ.652 కోట్లు వచ్చాయన్నారు. 

కొత్తగూడెం పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో 15 డయాలసిస్ యూనిట్లు, మరో ఐదింటికి ప్రపోజల్స్​ పంపినట్లు తెలిపారు. పాల్వంచ ఆసుపత్రి వంద పడకలుగా మార్పు, పాల్వంచ – కొత్తగూడెం మధ్య జియోలాజికల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, ముత్యాల విశ్వనాథం, అడుసుమల్లి సాయిబాబు, వీసంశెట్టి పూర్ణ, బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, నిమ్మల రాంబాబు, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.