కామారెడ్డి – బీదర్​ రైల్వే లైన్​ ఏర్పాటు చేయిస్తా : మదన్​మోహన్​రావు

కామారెడ్డి – బీదర్​ రైల్వే లైన్​ ఏర్పాటు చేయిస్తా : మదన్​మోహన్​రావు

లింగంపేట, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి సురేశ్​షెట్కార్​ను భారీ మెజార్టీతో గెలిపిస్తే కామారెడ్డి నుంచి లింగంపేట, ఎల్లారెడ్డి మీదుగా బీదర్​ వరకు రైల్వే  లైన్​ఏర్పాటుకు కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు హామీనిచ్చారు.  ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మోతె, గాంధీనగర్, ముస్తాపూర్, ఒంటర్​పల్లి, సురాయిపల్లి, కన్నాపూర్, ఐలాపూర్ గ్రామాల్లో బైక్​ర్యాలీ తో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.​​​​  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రితో మాట్లాడి లింగంపేట మండలంలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రీయల్​ కారిడార్​ను, స్కిల్​డెవలప్​మెంట్​ సెంటర్లు  ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు.   లింగంపేట మండల కేంద్రంలో రైల్వే స్టేషన్​, సెంట్రల్​ లైటింగ్​ ఏర్పాటు చేయిస్తానన్నారు.  కాంగ్రెస్​పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, జడ్పీటీసీ శ్రీలత సంతోష్​రెడ్డి, ఎంపీపీ నయీం, రఫియోద్దిన్​, ఎల్లమయ్య, సుప్పాలరాజు తదితరులు పాల్గొన్నారు.