తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట : మహిపాల్​ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట :  మహిపాల్​ రెడ్డి

రామచంద్రాపురం/పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి  పెద్దపీట వేస్తోందని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి తెలిపారు. మంగళవారం గుమ్మడిదల మండలం 13 గ్రామపంచాయతీల్లో రూ.12.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, తదితర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల వెంకటేశ్​ గౌడ్, నాయకులు, పాల్గొన్నారు.

త్వరలో గద్దర్​ కాంస్య విగ్రహావిష్కరణ 

పటాన్​చెరులోని బస్టాండ్ ఆవరణలో 11 అడుగుల గద్దర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి మంగళవారం తెలిపారు.  ఇప్పటికే 6 ఫీట్ల గద్దె నిర్మాణంతోపాటు 11 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైందన్నారు.