మిషన్ భగీరథ మోసపూరిత ప్రాజెక్ట్ : మట్టా రాగమయి

మిషన్ భగీరథ మోసపూరిత ప్రాజెక్ట్ : మట్టా రాగమయి

పెనుబల్లి, వెలుగు  :  మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చామని గత బీఆర్ఎస్  ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్​ మట్టా రాగమయి దయానంద్ ఆరోపించారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం లో రూ.కోటి ఎస్​డీఎఫ్​  నిధులతో నిర్మిస్తున్న బోరెవెల్ పైప్ లైన్ నిర్మాణానికి ఆమె ఆదివారం శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవికాలంలో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలకు తాగేందుకు నీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్​ గంట ప్రతాప్ ఎంపీఓ కిషోర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, మండల కాంగ్రెస్ నాయకులు గూడూరి మాధవరెడ్డి, పసుమర్తి విశ్వనాథ్, దొంతు మాధవరావు, రాజబోయిన కోటేశ్వరావు, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.