
గంగాధర, వెలుగు : కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన సొంత వాహనాన్ని బడిబాట విద్యావాహిని వెహికల్గా మార్చారు. గురువారం మల్లాపూర్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో వాహనాన్ని విద్యాశాఖ అధికారులకు అందజేశారు. చొప్పదండి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. స్కూళ్లలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం స్టూడెంట్స్కు బుక్స్, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రభాకర్రావు, హెచ్ఎం అంజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమల్రావు పాల్గొన్నారు.