
గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్సర్కార్లోనే రోడ్లు బాగా వేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్రామ్నగర్లో,13వ డివిజన్ విఠల్నగర్లో, 34వ డివిజన్ జవహర్నగర్లో రూ.ఐదు లక్షల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ఫండ్ నిధులతో, ఎన్టీపీసీ నుంచి నర్రశాలపల్లి వరకు రూ.రెండు కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఎన్టీపీసీ ఐదో డివిజన్ ప్రశాంత్నగర్లో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. గోదావరిఖని శివాజీనగర్లోని డైలీ మార్కెట్అభివృద్ధి పనులపై వ్యాపారుస్తులతో కలిసి చర్చించారు. త్వరలోనే మార్కెట్ను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్, కార్పొరేషన్ ఈఈ రామన్, లీడర్లు మహాంకాళి స్వామి, బొంతల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.