కాంగ్రెస్ సర్కార్లోనే రోడ్లకు మహర్దశ : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్

కాంగ్రెస్ సర్కార్లోనే రోడ్లకు మహర్దశ : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్​సర్కార్​లోనే రోడ్లు బాగా వేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ అన్నారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని 10వ డివిజన్​రామ్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో,13వ డివిజన్​ విఠల్​నగర్​లో, 34వ డివిజన్​ జవహర్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.ఐదు లక్షల చొప్పున స్పెషల్​ డెవలప్​మెంట్​ఫండ్​ నిధులతో, ఎన్టీపీసీ నుంచి నర్రశాలపల్లి వరకు రూ.రెండు కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.

 ఎన్టీపీసీ ఐదో డివిజన్​ ప్రశాంత్​నగర్​లో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. గోదావరిఖని శివాజీనగర్​లోని డైలీ మార్కెట్​అభివృద్ధి పనులపై వ్యాపారుస్తులతో  కలిసి చర్చించారు. త్వరలోనే మార్కెట్​ను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్​, కార్పొరేషన్​ ఈఈ రామన్​, లీడర్లు మహాంకాళి స్వామి, బొంతల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.