ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం : పద్మ దేవేందర్ రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం : పద్మ దేవేందర్ రెడ్డి

మెదక్ టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్  మెప్మా ఉద్యోగులకు వేతనాలు పెంచిన సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం  కేసీఆర్​ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ గతంలో మెప్మా ఉద్యోగస్తులకు  రూ.4 వేలు  వేతనం ఉండగా వారి శ్రమను గుర్తించిన సీఎం కేసీఆర్  రూ.6 వేలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మెన్​ చంద్రపాల్, నాయకులు అశోక్ పాల్గొన్నారు.