కాంగ్రెస్.. హత్య రాజకీయాలకు పాల్పడుతుంది: పద్మా దేవేందర్ రెడ్డి

కాంగ్రెస్..  హత్య రాజకీయాలకు పాల్పడుతుంది: పద్మా దేవేందర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని.. ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డినిని పద్మ దేవేందర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంకా వైద్యలు పర్యవేక్షణలలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

ఘటన జరిగిన ప్రాంతం నుంచి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకోచ్చే వరకు అయన పరిస్థితి దయనీయంగా ఉన్నదని.. అది చూసి జాలి పడాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు హేళన చేస్తున్నారని అన్నారు. గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతూ.. ఎన్నికల  వాతావరణాన్ని చెడగొడుతుందని  ఆరోపించారు. ఎన్నికల ప్రశాంతంగా జరపాలని ఎన్నికల కమిషన్ ను విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.