బీటీపీఎస్ రైల్వే లైన్ భూ నిర్వాసితులకు పరిహారం అందజేత : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

బీటీపీఎస్ రైల్వే లైన్ భూ నిర్వాసితులకు పరిహారం అందజేత : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

మణుగూరు, వెలుగు : బీటీపీఎస్ రైల్వే లైన్ భూ నిర్వాసితులకు పరిహారం చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం అందజేశారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గును రవాణా చేసేందుకు నిర్మిస్తున్న రైల్వే లైన్​ భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులు కొందరికి పరిహారం అందకపోవడంతో ఎమ్మెల్యే పాయంకు వినతి పత్రం అందజేశారు.

దీనికి స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో మాట్లాడి మండలంలోని గాంధీ నగర్, సుందరయ్య నగర్, కాళీమాత ఏరియా, శేషగిరి నగర్ ప్రాంతాల్లోని 24 మంది నిర్వాసితులకు ఒక్కొక్కరికీ రూ.5.50 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. తహసీల్దార్ అద్దంకి నరేశ్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.