
మణుగూరు, వెలుగు: అశ్వాపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన 751 మందికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం ప్రొసిడింగ్స్ అందజేశారు. అనంతరం మండలంలోని గొందిగూడెం ఆశ్రమ పాఠశాలలో రూ.1.80 కోట్లతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. గొందిగూడెం, ఎలకలగూడెం, తుమ్మలచెరువు గ్రామాలకు వెళ్లేందుకు ఇసుక వాగుపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజారావు, ఎంపీడీవో ముత్యాలరావు, ఆర్ అండ్ బీ డీఈ సతీశ్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ఓరుగంటి భిక్షమయ్య, నాయకులుతుక్కాని మధు, గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేశ్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
మణుగూరు, వెలుగు: మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పాయం అందజేశారు. ఐదుగురు లబ్ధిదారులకు రూ.2.30 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.